Sunday, April 28, 2024

మొక్కను నాటి నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన జోగినిపల్లి

- Advertisement -
- Advertisement -

మొక్కను నాటి నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్

MP Santhosh kumar plant tree in Green India challenge

హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు, గ్లోబల్ వార్మింగ్ ని అరికట్టేందుకు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ హైదరాబాద్ టోలిచౌకి లోని తన నివాసంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొక్కను నాటారు.

కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కను నాటి స్వాగతం పలకడం ఆనందాన్ని ఇచ్చిందని ఎంపి సంతోష్ కుమార్ తెలిపారు.  ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News