- Advertisement -
నల్లగొండ: నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేశారు. నిడమనూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల కమిషన్ తెలిపింది. రిటర్నింగ్ అధికారిగా మిర్యాలగూడ ఆర్డిఒ రోహిత్ సింగ్ని నియమించారు. మార్చి 30 వరకు నామినేషన్లకు గడువు ఉంటుందని, మార్చి 31 దరఖాస్తుల పరిశీలన ఉంటుందన్నారు. ఏప్రిల్ 3న నామినేషన్ల ఉపసంహరణతో పాటు అదే రోజు అభ్యర్థుల తుదిజాబితా విడుదల చేస్తామన్నారు. ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల పోలింగ్ ముగియనుంది.
- Advertisement -