- Advertisement -
మెదక్: పట్టణ ప్రగతిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. నర్సాపూర్లో రూ.5 కోట్లతో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం జరుగుతోందని, త్వరలో నర్సాపూర్ బస్సు డిపోను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రజలకు అధికారాలు, హక్కులు ఇచ్చిందని, పని చేయని కౌన్సిలర్లను తొలగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ మదన్ రెడ్డి, జడ్పి చైర్మన్ మురళీ యాదవ్, పలువురు టిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
Narsapur bus depot run as soon as says Harish rao
- Advertisement -