Thursday, May 9, 2024

ఎంఎల్‌సి కవితను ప్రశంసలతో ముంచెత్తుతున్న జాతీయ మీడియా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితను జాతీయ మీడియా ప్రశంసలతో ముంచెత్తుతోంది. దేశంలో మహిళా బిల్లు చర్చకు తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా ఎంఎల్‌సి కవితకే దక్కిందని ఉద్ఘాటించింది. కవిత జంతర్ మంతర్ దీక్ష మహిళా బిల్లుపై దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. జంతర్ మంతర్ వద్ద కవిత చేసిన దీక్ష యావత్ దేశాన్ని మహిళా బిల్లుపై చర్చించే పరిస్థితి కల్పించిందని పేర్కొంది. మహిళలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వరని, మహిళలపై గౌరవం ఉంటే రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని  గర్జించిన ఘనత కవితదేనని, దీక్ష ద్వారా మహిళా బిల్లుకు పలు ముఖ్యమైన పార్టీల మద్దతును సైతం కవిత కూడగట్టగలిగిందని వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News