- Advertisement -
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సుక్మా జిల్లాలోని కుకనార్ లో ఆరు వాహనాలకు నిప్పుపెట్టారు. రోడ్డు నిర్మాణ పనులకు వినియోగిస్తున్న రెండు లారీలు, జెసిబిలు, 2 పొక్లెయినర్లను తగులబెట్టారు. మావోయిస్టులు కుకనార్ ప్రాంతంలో బుధవారం ఈ ఘటనకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న సిఆర్పీఎఫ్ దళాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టుల కోసం విస్త్రృతంగా గాలిస్తున్నాయని అధికారులు తెలిపారు.
Naxals have set ablaze 6 vehicles including 2 JCBs
- Advertisement -