Saturday, May 4, 2024

వాయుసేన నూతన చీఫ్‌గా విఆర్ చౌదరి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత వాయుసే నూతన చీఫ్‌గా వివేక్ రామ్ చౌదరి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకటి చీఫ్ రాకేశ్ కుమార్ సింగ్ బదౌరియా పదవీ విరమణ చేయడంతో విఆర్ చౌదరి నియమితులయ్యారు. భారత వాయుసేన ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. విఆర్ చౌదరి వైమానిక ప్రధాన కార్యాలయం సహా ఫీల్డ్ ఫార్మేషన్‌లోనూ కీలక పాత్ర పోషించారు. ఆయన 1982లో వాయుసేనలో చేరారు. ఆయనకు మేఘదూత్ ఆపరేషన్, సఫేద్ సాగర్ ఆపరేషన్‌లో ఉపయోగించిన మిగ్-21, మిగ్-23 ఎంఎఫ్, మిగ్-29, సుఖోయ్-30, ఎంకెఐ యుద్ధ విమానం వంటివి 3800 గంటలకుపైగా నడిపిన అనుభవం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News