Thursday, May 2, 2024

నారాయణపేట, వికారాబాద్ జిల్లాలో కొత్త మండలాలు

- Advertisement -
- Advertisement -
New zones in Narayanpet and Vikarabad districts
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్ : నారాయణపేట్, వికారాబాద్ జిల్లాల్లో కొత్త మండలాలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేరిట బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. నారాయణపేట జిల్లాలో కొత్తగా గుండుమాల్, కొత్తపల్లె మండలాలు ఏర్పాటు చేసింది. నారాయణపేట రెవిన్యూ డివిజన్‌లోని పది గ్రామాలతో కలిసి గుండమల్ మండలాన్ని ఏర్పాటు చేయగా, 11గ్రామాలతో కలిపి నూతనంగా కొత్తపల్లె మండలంగా ప్రతిపాదించింది. అలాగే వికారాబాద్ జిల్లాల్లో నూతనంగా దూడ్యాల్ మండలాన్ని 12 గ్రామాలతో కలిసి ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను రెవెన్యూ శాఖ జారీ చేసింది. వీటి ఏర్పాటుకు సంబంధించి నెల రోజుల్లోగా అభ్యంతరాలు, వినతులు ఇవ్వాలని ప్రభుత్వం సదరు ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల్లోని ప్రజలు, రాజకీయ నాయకుల నుంచి విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల కొత్తగా ఏర్పాటైన మండలాల్లోని ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News