- Advertisement -
హైదరాబాద్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 16న హైదరాబాద్లో, 17వ తేదీన బెంగళూరులో పర్యటించనున్నారు. బడ్జెట్లో ప్రభావితం కానున్న వర్గాలను ఆమె కలవనున్నారు. నిర్మలా సీతారామన్ పర్యటన వివరాలను ఆర్థిక మంత్రిత్వశాఖ ట్విటర్లో వెల్లడించింది.హైదరాబాద్లోని ట్రిడెంట్ హోటల్లో తొలుత ఆమె వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లతో మాట్లాడనున్నారు. ఇక, రెండో సెషన్లో ఆర్థిక వేత్తలు, పన్ను ప్రాక్టిషనర్లు, విద్యావంతులు, విధాన కర్తలతో భేటీ కానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.
Nirmala Sitharaman to visit Hyderabad Bengaluru
- Advertisement -