Sunday, May 5, 2024

15న నగరంలో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

- Advertisement -
- Advertisement -

No water supply in various parts of Hyderabad on 15th

హైదరాబాద్: పంజాగుట్ట స్మశాన వాటిక సమీపంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆ ప్రాంతంలో ఉన్న 1000 ఎంఎం డయా ఎయిర్ వాల్వ్‌లను మార్చాల్సిన కారణంగా 15వ తేదీన 24 గంటల పాటు నీటి సరఫరా నిలివేస్తున్నట్లు జలమండలి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 24 గంటల పాటు జరిగే ఈ మరమ్మత్తుల కారణంగా 15వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 16వ తేదీని ఉదయం 6 గంటల వరకు నీటిసరఫరా జరగదన్నారు. వినియోగదారులకు కలిగి అ సౌకర్యానికి చింతిస్తున్నామని, వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంచినీటి పైపులైను మరమ్మత్తుల కారణంగా ఎర్రగడ్డ, బంజారాహిల్స్, ఎల్లారెడ్డి గూడ, ఎస్‌ఆర్‌నగర్, వెంగళరావు నగర్, సోమాజీగూడ, వెంకటగిరి 6వ డివిజన్ కింద ఉన్న ప్రాంతాలకే కాకుండా డివిజన్ 9లోని మూసాపేట సెక్షన్ పరిధిలోని పాండురంగనగర్, కబీర్‌నగర్ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News