Wednesday, May 15, 2024

భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

- Advertisement -
- Advertisement -

స్టాక్‌హోం : ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాల ప్ర కటనలో భాగంగా భౌతిక శాస్త్రంలో పురస్కారా న్ని రాయల్ స్వీడిష్ అకాడమీఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది ఈ పురస్కారం ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెర్రెన్స్‌క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్‌హ్యూలియర్‌కు ఈ ఏడాది నోబెల్‌ను ప్రకటించారు.

అణువుల్లో ఎలక్ట్రానిక్ డైనమిక్స్‌ను అధ్యయనం చేసినందుకు, కాంతి తరంగాల లటో సెకండ్ ప ల్స్‌ను ఉత్పత్తి చేసే పరిశోధనలకుగాను వీరికి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. వీరి పరిశోధనలతో అ ణువులు, పరమాణువుల్లో ఎలక్ట్రాన్స్‌ను అధ్యయ నం చేసేందుకు మానవాళికి కొత్త సాధనాలు లభించాయని పేర్కొంది. కాగా బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్య విభాగాల్లో గ్రహీతలను ప్రకటిస్తారు. శుక్రవారం 2023 నోబెల్ శాంతిబహుమతిని, 9వ తేదీన అర్థశాస్త్రంలో నోబెల్ పురసార గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News