Friday, April 26, 2024

కొత్తగూడెంలో ట్రాక్టర్ బోల్తా: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One Member dead in Tractor accident in kothagudem

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుండాల మండలం శంభునిగూడెం వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News