Monday, May 6, 2024

బిజెపిని గద్దె దింపాలంటే విపక్షాలన్నీ ఏకం కావాలి: అఖిలేశ్ యాదవ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిజెపి పార్టీని గద్దె దింపాలంటే విపక్షాలన్నీ ఏకం కావాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు.బిజెపిని గద్దె దించడమే విపక్షాల లక్ష్యమని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులను కలుపుకోవాలని, విపక్షాల పోరాటంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌తో చర్చించేందుకు తెలంగాణకు వచ్చానని అఖిలేశ్ యాదవ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్ సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, జాతీయ రాజకీయాలపై వారు చర్చించనున్నట్లు సమాచారం. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించినట్లు తెలిసింది. గతంలోనూ ఇరువురి మధ్య పలు సందర్భాల్లో చర్చలు జరిగాయి. ఇటీవల పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశం.. త్వరలో బెంగళూరు వేదికగా జరగనున్న మరో దఫా భేటీ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకొంది.
అఖిలేష్ యాదవ్‌కు స్వాగతం పలికిన మంత్రులు
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ గురువారం హైదరాబాద్ నగరానికి వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో అఖిలేష్ యాదవ్‌కు వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం అఖిలేశ్ యాదవ్.. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డుమార్గాన నేరుగా ప్రగతి భవన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇరువురు భేటీ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News