ఉద్యోగులు ఓవర్ టైమ్ చేస్తే అదనపు జీతం వస్తుంది. అదే హీరోయిన్లు ఓవర్టైమ్ చేస్తే రెమ్యునరేషన్ కింద మరింత డబ్బు వస్తుంది. అందుకే వీలైనన్ని ఎక్కువ సినిమాలు అంగీకరిస్తుంటారు హీరోయిన్లు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఇదే. అయితే ఇదే విషయాన్ని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కాస్త పద్ధతిగా చెబుతోంది. పారితోషికం విషయాన్ని ఎత్తకుండా పని గురించి గొప్పగా చెప్పుకొచ్చింది. “కరోనా లాక్డౌన్ వల్ల ఎన్నో సినిమాలు వాయిదా పడ్డాయి. ఎంతోమంది పని కోల్పోయారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నాకు పని దొరికింది. వరుసపెట్టి సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఇలా పని దొరకడం నా అదృష్టం. కాబట్టి ఓవర్ టైమ్ అనేది నాకు పెద్ద సమస్య కాదు”అని చెప్పింది రకుల్ప్రీత్ సింగ్. ఇక అక్షయ్ కుమార్ సరసన మిషన్ సిండ్రిల్లా అనే సినిమాలో నటిస్తోంది రకుల్. తమిళ్లో హిట్టయిన రాట్ససన్ (తెలుగులో రాక్షసుడు) సినిమాకు రీమేక్ ఇది. ఈ ప్రాజెక్టుతో పాటు మరో 3 హిందీ సినిమాలు చేస్తోంది రకుల్. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన కొండపొలం సినిమాలో రకుల్ హీరోయిన్గా నటించింది.
అది నాకు పెద్ద సమస్య కాదు
- Advertisement -
- Advertisement -
- Advertisement -