- Advertisement -
గత కొంతకాలంగా టాలీవుడ్లో అవకాశాలు తగ్గుముఖం పట్టాక రకుల్ప్రీత్ సింగ్ కన్ను బాలీవుడ్, కోలీవుడ్ మీద పడింది. అయితే బాలీవుడ్లో సీనియర్ స్టార్లతో సినిమాలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు ఈ బ్యూటీ. ఇదిలా ఉండగా చిత్ర పరిశ్రమలో హీరోల ఆధిపత్యం గురించి రకుల్ మాట్లాడుతూ “ఇప్పుడు ట్రెండ్ మారింది. నయనతార, కంగనారనౌత్, దీపికా పదుకునే, అలియాభట్, త్రిషలు హీరోల ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నారు. ఈ స్టార్ హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తమ టాలెంట్తో ఉమెన్ పవర్ చూపిస్తున్నారు. ప్రస్తుతం సినిమాల విజయాల్లో హీరోలతో పాటు హీరోయిన్లు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇది శుభ పరిణామం”అని పేర్కొంది.
- Advertisement -