Sunday, April 28, 2024

బకాయి కోసం ఉద్యోగిని హత్య చేసిన యజమాని

- Advertisement -
- Advertisement -

murder

బెంగళూరు: వేతన బకాయిలు ఇవ్వమన్నందుకు డ్రైవర్‌గా పని చేస్తున్న ఉద్యోగిని యజమాని చంపిన సంఘటన కర్నాటకలో రామముర్తి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీంతో యజమానిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శ్రీనివాస్ అనే డ్రైవర్ క్రిష్ణ అనే యజమాని వద్ద డోర్ డెలవరీ బాయ్‌గా పనిచేసేవాడు. వేతన బకాయిలు ఇవ్వకపోవడంతో కృష్ణను శ్రీనివాస్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చింతమణి ప్రాంతంలో ఆఫీసులో శ్రీనివాస్ నిద్రకు ఉపక్రమించగానే కృష్ణ రాళ్లతో దాడి చేసి అతడిని హత్య చేశాడు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తన దగ్గర పని చేస్తున్న మరో ఉద్యోగితో కలిసి మృతదేహాన్ని ప్యాక్ చేసి రామ్‌పూరా చెరువులో సమీపంలో పడేశాడు. చెరువుకు సమీపంలో మృతదేహం నుంచి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో యజమాని కృష్ణ తన ఉద్యోగి శ్రీనివాస్‌ను హత్య చేసినట్టు తేలింది. కృష్ణను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

Owner murders employee in Bengaluru, sets his body ablaze after he demands outstanding salary, accused took the body to the Rampura lake and dumped it
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News