గురుగ్రామ్: హర్యానాలోని గురుగ్రామ్లో శనివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. సోహ్నా రోడ్లోని ఎలివేటెడ్ కారిడార్ స్లాబ్ కూలిపోయింది. అర్ధరాత్రి సమయం కావడం పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. రాజీవ్ చౌక్ నుంచి సోహ్నా వరకు ఆరు కిలోమీటర్ల పొడవున రూ.2 వేల కోట్లతో ఈ ఫ్లైఓవర్ను నిర్మిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఫ్లైఓవర్ను ఓరియంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నిర్మిస్తోంది. దేశంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఫ్లైఓవర్ ఎలివేటెడ్ రోడ్డులోని కొంత భాగం కూలిందని ఓరియంటల్ కంపెనీ ప్రాజెక్ట్ హెడ్ శైలేష్ సింగ్ చెబుతున్నారు. ఇప్పటికే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)బృందం, ఎస్డిఎం, సివిల్ డిఫెన్స్ బృందం ఘటనాస్థలానికి చేరుకున్నాయని హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా తెలిపారు.
Part of under construction flyover at Gurugram