Wednesday, May 1, 2024

నేను పగటి కలలు కనే వ్యక్తిని కాదు: పవన్

- Advertisement -
- Advertisement -

Pawan Kalyan welcomes YS Sharmila's New Party

హైదరాబాద్: దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో గురువారం రాజకీయ పార్టీ ప్రకటించనున్నారు. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వైఎస్ షర్మిల పార్టీని స్వాగతిస్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఎపి పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో మరిన్ని పార్టీలు రావాలని ఆయన ఆకాక్షించారు. ఉద్యమ, చైతన్య స్ఫూర్తి ఉన్న యువత రాజకీయాల్లోకి రావాలని పవన్ పిలుపునిచ్చారు. ”నేను పగటి కలలు కనే వ్యక్తిని కాదు. నాకు రాజకీయ వారసత్వం చేతకాదు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలనుకున్నా. నాకు డబ్బు బలం లేదు” అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News