Thursday, May 9, 2024

జలదోపిడి చేస్తూ ఎపి నీతులు మాట్లాడుతోంది: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Jagadeesh reddy comments on AP Govt over water issue

 

హైదరాబాద్: టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఓ పగటి వేషగాడని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్ అధికారంలోకి వస్తానని పగటి కలలు కంటున్నారని చురకలంటించారు. యావత్ తెలంగాణ సమాజం సిఎం కెసిఆర్‌కు అన్ని వేళలా అండగా ఉంటుందని, ప్రతపక్షాలు ఏనాడు ప్రజల గురించి పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మరన్నారు. ఎపి ప్రభుత్వం జలదోపిడి చేస్తూ నీతులు మాట్లాడుతోందని దుయ్యబట్టారు. పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీటిని తోడుకుపోతున్నారని, తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News