Saturday, April 27, 2024

ఎపిలో మరో 2,982 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

2982 new covid-19 cases reported in AP

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 91,070 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,982 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో 27 మంది కోవిడ్-19తో మరణించారు. తాజాగా మరో 3,461 మంది బాధితులు కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 31,850 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,11,318కి పెరిగాయి. ఇప్పటివరకు 18,66,522 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఎపిలో ఇప్పటివరకు కరోనాతో 12,946 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

2982 new covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News