Thursday, May 2, 2024

రైల్వే పనులు రయ్.. రయ్

- Advertisement -
- Advertisement -
Permits for ROB and RUB works
ktr

 

ఆర్‌ఒబి, ఆర్‌యుబి పనులకు యుద్ధప్రాతిపదికన అనుమతులు
వచ్చే వర్షాకాలంలోగా రైల్వేకు సంబంధించిన పనులు పూర్తి అవ్వాలి
జిహెచ్‌ఎంసి, రైల్వే అధికారులతో మంత్రి కెటిఆర్ సమీక్ష
దక్షిణ మధ్య రైల్వే సమన్వయ అధికారిగా అర్వింద్‌కుమార్ నియామకం

మన తెలంగాణ/హైదరాబాద్ : వచ్చే వర్షాకాలం లోపల సాధ్యమైనన్ని ఎక్కువ చోట్ల రైల్వే కు సంబంధించిన పనులను పూర్తిచేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలని జిహెచ్‌ఎంసి అధికారులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె టిఆర్ ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం చేపట్టిన రైల్వే అండర్ పాసులు, రైల్వే ఓ వర్ బ్రిడ్జీల నిర్మాణ పనులను శరవేంగా పూర్తి చేయాలన్నారు. సోమవారం నాడిక్కడ జిహెచ్‌ఎంసి, రైల్వే శాఖ అధికారులతో మంత్రి కెటిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నగర పరిధిలో జరుగుతున్న రోడ్డు విస్తరణ, లింక్ రోడ్లు, స్లిప్ రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తె చ్చెందుకు రైల్వే పరిధిలో వున్న పనులలో వేగాన్ని పెంచుటకు రైల్వే శాఖ తో సమన్వయము చేసేందుకుగానూ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా, ఇతర అధికారులతో మంత్రి కెటిఆర్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిహెచ్‌ఎంసి ఇ ప్పటికే అనేక రోడ్డు నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా ఎస్‌ఆర్‌డి పి, సిఆర్‌ఎంపి, స్లిప్, లింకు రోడ్ల పనులను పూర్తి చేసేందుకు ప్రస్తుత లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు తెలిపారు. నగరంలో పలుచోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి రైల్వే, రైల్వే అండర్ బ్రిడ్జి లకు సంబంధించిన పనులు పెండింగులో ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆయా పనులను పూర్తి చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే సహకారాన్ని అందించాల్సిందిగా మంత్రి కెటిఆర్ కోరారు. ఆర్‌ఒబి, ఆర్‌యుబిల పూర్తికి చేపట్టే పనులకు అవసరమైన అన్ని రకాల అనుమతులను ప్రాధాన్యతగా గుర్తించి జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్తగా ప్రతిపాదిస్తున్న స్లిప్, లింక్ రోడ్లు విస్తరణ, రైల్వే ఓవర్ బ్రిడ్జి లపై రైల్వే అధికారులతో కలిసి సంయుక్త సర్వే నిర్వహించాలని జి హెచ్ ఎం సి అధికారులకు సూచించారు. దక్షిణ మధ్య రైల్వే తో సమన్వయమునకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ను నియమిస్తున్నట్లు తెలిపారు.

రైల్వే క్రాసింగ్స్ వద్ద ప్రమాదాల నివారణ కు ఆయా ప్రాంతాలలో చేపట్టాల్సిన పనులను సూచించుటకు నిపుణులు కమిటీ ని నియమించనున్నట్లు తెలిపారు. జిహెచ్‌ఎంసి రోడ్డు వర్కు లతో పాటు హైదరాబాద్ జలమండలికి సంబంధించిన కొన్ని మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించిన పనులు కూడా దక్షిణ మధ్య రైల్వేతో జతకూడి ఉన్న నేపథ్యంలో వాటిపై కూడా సమావేశంలో మంత్రి కెటిఆర్ చర్చించారు. రైల్వే శాఖ కూడా జిహెచ్‌ఎంసీ మాదిరిగా వేగంగా పనులను పూర్తిచేసి నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పేలా చూడాలని కోరారు. జి హెచ్‌ఎంసి కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగిన ఈ సమావేశoలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య, మరియు రైల్వే ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్ డి ఎస్ లొకేశ్ కుమార్, జలమండలి ఎం డి దానకిషోర్, చీఫ్ ఇంజనీర్లు వసంత, శ్రీధర్, జియాఉద్దీన్, సిసిపి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Permits for ROB and RUB works
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News