Thursday, May 2, 2024

కరోనా… మృతదేహాలను నదిలో పడేసి…..

- Advertisement -
- Advertisement -

Persons throwing COVID patient's body in river Rapti

 

లక్నో: కరోనా వైరస్ తో మృతి చెందిన వారి శవాలను రప్తి నదిలో పడేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బల్రాంపూర్ లో జరిగింది. ఇద్దరు వ్యక్తులు కరోనాతో చనిపోవడంతో వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు ఆస్పత్రి సిబ్బంది అప్పగించారు. ఆ రెండు మృతదేహాలను కుటుంబ సభ్యులు రప్తి నదిలో పడేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఎంఒ తెలిపాడు.  యుపిలో గంగా నది ఇసుకలో వందల కొద్దీ మృతదేహాలను పాతి పెట్టిన విషయం తెలిసింది. గంగా నదిలో ఒడ్డున పదుల సంఖ్యలో మృతదేహాలు కనిపించాయి. ఉత్తర ప్రదేశ్ లో ఆదివారం 1908 కరోనా కేసులు నమోదుకాగా 140 మంది చనిపోయారు. ఒక్క రోజే కరోనా నుంచి 6713 మంది కోలుకోగా ప్రస్తుతం 41 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News