Friday, May 17, 2024

బాలికను ఎత్తుకెళ్తుండగా మూకదాడి… ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

Man lynched on suspicion of abducting minor girl

ముంబయి: బాలికను బలవంతంగా తీసుకెళ్తున్న వ్యక్తిపై మూక దాడి చేయడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయిన సంఘటన మహారాష్ట్రలోని థానే ప్రాంతం వాగ్లీ ఈస్టేట్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రామావతార్ ధోబి అనే వ్యక్తి మైనర్ బాలికను ఎత్తుకెళ్తుండగా కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. వెంటనే అతడిని పట్టుకోవడంతో పది మంది కలిసి అతడిపై దాడి చేశారు. ఈ దాడిలో ధోబి ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నలుగురు నిందితులు అతిఖ్ ఖాన్, మోహసిన్ అఫ్సర్ వస్తా, హరిష్ సోలంకి, మహ్మాద్ అన్సారీని అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉండడంతో అతడి కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News