Wednesday, May 15, 2024

ప్లాస్మా థెరపీ సక్సెస్.. ఢిల్లీలో కోలుకున్న కరోనా బాధితుడు

- Advertisement -
- Advertisement -

Plasma Therapy

 

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను నివారించడంలో భాగంగా ప్రవేశపెట్టిన ప్లాస్మా చికిత్స సత్ఫలితాలనిస్తోంది. వారం రోజుల క్రితమే దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కాగా ఢిల్లీలో తొలి విజయం నమోదైంది. 49 ఏళ్ల కరోనా బాధితుడు ప్లాస్మా చికిత్సతో పూర్తిగా కోలుకున్నట్లు సాకేత్‌లోని మ్యాక్స్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 4న 49 ఏళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా, పరీక్షలు నిర్వహించగా అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

కొద్ది రోజుల్లోనే అతడి ఆరోగ్యం క్షీణించి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే డాక్టర్లు అతడికి ప్లాస్మాథెరపీని అందించారు. కరోనానుంచి కోలుకున్న వ్యక్తినుంచి ప్లాస్మా సేకరించి అతడికి చికిత్స అందించారు. ఊహించని రీతిలో ఈ చికిత్స మంచి ఫలితాన్నిచ్చింది. దీంతో అతడికి అమర్చిన వెంటిలేటర్‌ను సైతం తొలగించారు. రెండు సార్లు నిర్వహించిన కోవిడ్ పరీక్షలో సైతం నెగెటివ్ రావడంతో అతను పూర్తిగా కోలుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

అయితే ఈ ప్లాస్మా చికిత్స కరోనాను నివారించే మ్యాజిక్ ఫార్ములా కాదని మ్యాక్స్ గ్రూపు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ బుధిరాజు అన్నారు.‘ ప్లాస్మా థెరపీ ద్వారానే అతను కోలుకున్నాడని చెప్పలేం. ఎందుకంటే ఇతర ప్రోటోకాల్స్‌ను కూడా మేము ఫాలో అయ్యాం. ప్లాస్మా క్లినికల్ ట్రయల్స్‌తో మన దేశం ఒక అడుగు ముందుకేసిందని భావిస్తున్నా. కరోనా సోకిన వ్యక్తినుంచి సేకరించిన ప్లాస్మాలో యాంటీబాడీస్ అధికంగా ఉంటాయి. దీన్ని ఇతర కరోనా రోగులకు అందించడం ద్వారా వారు త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువ’ అని ఆయన చెప్పారు. అంతేకాదు, ఒక దాత 400 మిల్లీలీటర్ల ప్లాస్మాను దానం చేయవచ్చని, దీనిద్వారా ఇద్దరి ప్రాణాలనుకాపాడవచ్చని డాక్టర్ బుధిరాజు చెప్పారు.

Plasma Therapy Success
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News