Wednesday, May 8, 2024

25నాటికి రైతుల ఖాతాకు పిఎం కిసాన్ నిధులు

- Advertisement -
- Advertisement -

PM Kisan funds to farmers account by dec 25th

 

మనతెలంగాణ/హైదరాబాద్ : క్రేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చేయూతగా పధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద అందజేసే నిధుల విడుదలకు చర్యలు చేపట్టింది. ఈ పథకం కింద పదవ విడతగా నిధులను ఈ నెల 25నాటికి రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసేలా చర్యలు తీసుకుంది. ఈ పథకం కింద పోలం గరిష్ట విస్తీర్ణతత నిమిత్తం లేకుండా అర్హత గల ఒక్కో రైతుకు ఏటా ఆరు వేల రూపాయలు అందజేస్తోంది. ఈ మొత్తాన్ని ఒక్కో విడుతకు రూ.2వేల చొప్పుల మొత్తం మూడు విడతలుగా రైతులకు అందజేస్తోంది. కేంద్రం పిఎం కిసాన్ నిధులను ఇప్పటివరకూ తొమ్మిది విడతులగా రైతుల ఖాతాను నగదు జమ చేస్తూ వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News