- Advertisement -
న్యూఢిల్లీ: ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్లో పార్లమెంటు సభ్యులకు కోసం కొత్తగా 184 ఫ్లాట్లను నిర్మించారు. సోమవారం ఈ పాట్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. మొత్తం నాలుగు టవర్లను నిర్మించి.. వీటికి దేశంలోని నాలుగు ప్రముఖ నదులు కృష్ణ, గోదావరి, కోసి, హూగ్లీ పేర్లును పెట్టారు. ఆధునిక వసతుతలతో ఎంపిలకు ఈ పాట్లను అందించనున్నారు. పాట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ సందర్భంగా ప్రధాని.. ఆవరణలో సిందూర్ మొక్కను నాటారు. “ఈరోజు పార్లమెంటులో నా సహోద్యోగుల కోసం నివాస సముదాయాన్ని ప్రారంభించే అదృష్టం నాకు లభించింది. నాలుగు టవర్లకు దేశంలోని నాలుగు గొప్ప నదులు కృష్ణ, గోదావరి, కోసి, హూగ్లీ పేర్లను పెట్టాం” అని ఆయన అన్నారు.
- Advertisement -