Saturday, April 27, 2024

బెంగాల్ కోసం ప్రాణత్యాగానికి సిద్ధం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

PM Modi public meeting in Kharagpur West Bengal

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి బెంగాల్ సిఎం మమతా బెనర్జీపై ఫైర్ అయ్యారు. దీదీ సర్కార్ ప్రజల ఆశయాలను వమ్ము చేస్తోందని ప్రధాని మండిపడ్డారు. రెండు రోజులుగా బెంగాల్ లో పర్యటిస్తున్న మోడీ ఖరగ్ పూర్ సభలో మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. 70ఏళ్లుగా అన్ని పార్టీలు బెంగాల్ ను నాశనం చేశాయని ఆరోపించారు. బిజెపికి అవకాశం ఇస్తే ఈ విధ్వంసం నుంచి బెంగాల్ ప్రజలను కాపాడుతామని చెప్పారు. బెంగాల్ కోసం ప్రాణత్యాగానికైనా సిద్దమని ప్రధాని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు పేదలకు చేరకుండా బెంగాల్ సర్కార్ అడ్డుకుంటోందన్నారు. సిఎం మమతా బెనర్జీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన చెప్పారు.

PM Modi public meeting in Kharagpur West Bengal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News