Friday, May 3, 2024

నాలుగు రాష్ట్రాల సిఎంలతో మాట్లాడిన ప్రధాని

- Advertisement -
- Advertisement -

PM Modi speaks to CMs of four state on Covid situation

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఆదివారం పంజాబ్, కర్ణాటక, బీహార్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో మాట్లాడారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్-19 పరిస్థితులపై ప్రధాని మోడీ ఆరా తీశారు. గత కొద్ది రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్‌లతో మోడీ మాట్లాడుతున్నారు. అక్కడి పరిస్థితులపై సలహాలను అందిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవటానికి వారు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రులు ఆయనకు వివరించారు. భారత్ లో ఒకే రోజులో 4,03,738 తాజా కోవిడ్ -19 కేసులను నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. రోజువారీ 4,092 మరణాలతో మరణించిన వారి సంఖ్య 2,42,362కు చేరుకుంది.

PM Modi speaks to CMs of four state on Covid situation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News