Sunday, April 28, 2024

మోడీ శ్రీకారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఈ నెల 8వ తేదీన తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ రూ. 11,355 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. బేగంపేట విమాశ్రయం నుంచి నేరుగా సికింద్రాబాద్ చేరుకోనున్న ప్రధాన మంత్రి తొలుత సికింద్రాబాద్ తిరుపతి మధ్యన సేవలందించనున్న వందే భారత్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇది దేశంలో ప్రవేశ పెట్టనున్న 13వ వందే భారత్ రైలు కావడం గమనార్హం. ఈ రైలు కారణంగా సికింద్రాబాద్ తిరుపతి మధ్యన ప్రయాణ సమయం 12 గంటల నుండి 8.00 గంటల 30 ని.లకు తగ్గి పోనుంది. హైదరాబాద్ నుండి ఆధ్యాత్మిక నగరం తిరుపతికి ప్రయాణించనున్న వారికి అనుకూలంగా ఈ వందే భారత్ రైలు సేవలు ఉండనున్నాయి.

అనంతరం రూ. 715 కోట్లు ఖర్చు చేసి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నందు చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. ఇందులో భాగంగా రాబోయే 40 సంవత్సరాల వరకు ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను అందించటానికి వీలుగా రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 25 వేల మంది ప్రయాణికుల నుండి రద్దీ సమయంలో 3 లక్షల 25 వేల మంది ప్రయాణికులకు కూడా సౌకర్యాలను అందించగలిగేలా రైల్వే స్టేషన్ సామర్ధాన్ని పెంచనున్నారు. రైల్వే స్టేషన్ లో ప్రస్తుతం ఉన్న 11,427 చదరపు మీటర్ల బిల్డింగ్ ఏరియాను అంతర్జాతీయ ప్రమాణాలతో 61,912 చదరపు మీటర్లకు పెంచటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

టెర్మినల్ బిల్డింగ్ నుంచి అన్ని ప్లాట్ ఫామ్స్‌ను కలిపేలా 108 మీటర్ల ప్రత్యేక డబుల్ లెవల్ వంతెనను ఈ స్టేషన్ నందు ఏర్పాటు చేయనున్నారు. ఆధునీకరణ పనులలో భాగంగా ఈస్ట్, వెస్ట్ మెట్రో స్టేషన్లకు, రేతి ఫైల్ బస్ స్టేషన్‌కు నేరుగు కనెక్టివిటీని ఏర్పాటు చేయనున్నారు. మల్టీ లెవల్ కార్‌పార్కింగ్ వచ్చి, వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేక మార్గాల ఏర్పాటు వంటి అనేక వసతులను అభివృద్ధి పనులలో భాగంగా కల్పించనున్నారు.
సికింద్రాబాద్ మహబూబ్‌నగర్ మధ్యన రూ. 1,410 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేసిన 85 కిమీల పొడవైన డబ్లింగ్ రైల్వే లైన్ ను జాతికి అంకితం చేయనున్నారు. సామాస్య ప్రజల రైలుగా మన్ననలు పొందిన ఎంఎంటిఎస్ ఫేజ్ 2 లో భాగంగా హైదరాబాద్ నగర శివారు పట్టణాల వరకు నిర్మించిన నూతన రైల్వే లైన్ల మీదుగా నడపనున్న 13 కొత్త ఎంఎంటిఎస్ సర్వీసులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.

ఎంఎంటిఎస్ ఫేజ్ 2లో భాగంగా బొల్లారం, మేడ్చల్ మధ్యన 14 కిమీలు, ఫలక్‌నుమా , ఉందా నగర్ మధ్యన 14 కిమీల పొడవున కొత్త డబ్లింగ్ లైన్లను నిర్మించారు. ఈ అభివృద్ధి పనులు, వాటి ప్రయోజనాలకు సంబంధించి రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ప్రదర్శనను ప్రధాని తిలకించనున్నారు. ఇకపై నగరం శివారు ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే సామాన్య ప్రజలు అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చునని దమ రైల్వే తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News