- Advertisement -
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. అయితే ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్లో స్పల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆయన టూర్ సమయం మారింది. రేపు సాయంత్రం హైదరాబాద్ కు రావాల్సిన ప్రధాని మధ్యాహ్నం ఒంటిగంటకు హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం భారత్ బయోటెక్ ను సందర్శించనున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ, పురోగతిపై మోడీ సమీక్షించనున్నారు. తిరిగి రేపు మధ్యాహ్నం 3గంటలకు హకీంపేట ఎయిర్ పోర్టు నుంచి ఆయన బయల్దేరనున్నారు.
PM Narendra Modi Hyderabad schedule change
- Advertisement -