Wednesday, May 1, 2024

శ్రేయాస్ మీడియాపై కేసు

- Advertisement -
- Advertisement -

Police booked case against Shreyas media

కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
అనుమతికి మించిన మంది హాజరు

హైదరాబాద్: పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో నిబంధనలు ఉల్లంఘించిన శ్రేయాస్ మీడియాపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప ప్రీ రిలీజ్ వేడుకను శ్రేయాస్ మీడియా యూసుఫ్‌గూడలోని తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ బెటాలియన్ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించారు. అల్లు అర్జున్, రష్మిక మందన నటించిన సినిమా ప్రీ రిలిజ్ వేడుకకు పోలీసులు 5,000 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. కాని శ్రేయాస్ మీడియా వారు 10,000 మందికి పాసులు జారీ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జాం కావడం, స్థానికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించిన శ్రేయాస్ మీడియాపై 143, 341, 336, 209 ఐపిసి కింద కేసులు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్ ఇన్స్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News