- Advertisement -
ఐదు గంటలు విచారణ
అనంతరం విడుదల, 8న మరోసారి విచారణ
హైదరాబాద్: తీన్మార్ మల్లన్నను చిలకలగూడ పోలీసులు గురువారం విచారణ చేశారు. దాదాపు 5గంటల పాటు విచారించిన పోలీసులు అనంతరం విడుదల చేశారు. ఈ నెల 8వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు చెప్పారు. తాను పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న పోలీసులకు చెప్పాడు. అయితే జ్యోతిష్యుడు లక్ష్మికాంత్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేయడంతో విచారణ చేశారు. వ్యక్తిగత డాటా తీసుకుంటున్నాడని ఫిర్యాదు రావడంతో నగర సైబర్ క్రైం పోలీసులు క్యూ న్యూస్ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కార్యాలయం నుంచి పోలీసులు హార్డ్ డిస్క్లను తీసుకుని వెళ్లారు.
- Advertisement -