- Advertisement -
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. మరోసారి 42 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 42,982 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా 41,726 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 533 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,18,12,114 కు పెరిగింది. ఇందులో 3,09,74,748 మంది కోలుకున్నారు. వైరస్ బారిన పడి మొత్తం 4,26,290 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,11,076 యాక్టివ్ కేసులు ఉన్నాయి. టీకా డ్రైవ్లో భాగంగా 48,93,42, 295 డోసులు పంపిణీ అయ్యాయని ఆరోగ్యశాఖ పేర్కొంది.
42982 New Covid19 Cases Reported in India
- Advertisement -