Friday, April 26, 2024

చిరంజీవి అల్లుడిపై న్యూసెన్స్ కేసు

- Advertisement -
- Advertisement -

Nuisance case against chaitanya jonnalagadda

రోజు గొడవ చేస్తున్నారని అపార్ట్‌మెంట్ వాసుల ఫిర్యాదు
కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు
కౌన్సెలింగ్‌తో రాజీపడ్గ ఇరు వర్గాలు

హైదరాబాద్: చిరంజీవి సోదరుడు నాగబాబు అల్లుడు జోన్నలగడ్డ చైతన్యపై నమోదైన న్యూసెన్స్ కేసులో ఇరువర్గాలు రాజీకుదుర్చుకున్నాయి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ప్లాట్‌ను అద్దెకు తీసుకుని సినీనటి నిహారిక, చైతన్య దంపతులు ఉంటున్నారు. గత కొంత కాలం నుంచి చైతన్య ఇంటికి కొంత మంది యువకులు వస్తున్నారని వచ్చిన ప్రతి సారి మద్యం సేవించి గొడవ చేస్తున్నారని అపార్ట్‌మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మంగళవారం అపార్ట్‌మెంట్ వాసులు, చైతన్య మధ్య వాగ్వాదం జరిగింది. అంతేకాకుండా చైతన్య అపార్ట్‌మెంట్‌లో ఆఫీస్ పెట్టవద్దని గొడవకు దిగారు. తన ఆఫీస్‌లోకి వచ్చి అపార్ట్‌మెంట్ వాసులు గొడవ చేశారని చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అపార్ట్‌మెంట్‌లోని సిసిటివి ఫుటేజ్‌ను సేకరించారు. ఇరువురిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. అనంతరం ఇరువార్గలు రాజీకి రావడంతో కేసును మూసివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News