Sunday, April 28, 2024

లైన్ మెన్ ధైర్య సాహసాలు మెచ్చుకోవాల్సిందే…. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: అతి భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ సర్కిల్, కొత్తగూడ సెక్షన్ పరిధిలోని గంగారాం కొత్తగూడ మండలాలు దట్టమైన అడవులతో వాగులు వంకలతో కరెంట్ పోల్ లు, ట్రాన్స్ పార్మర్లు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో పెగడపల్లి సబ్‌స్టేషన్‌లోని 11కెవి పొగుళ్లపల్లి ఫీడర్‌ భారీ వర్షాల కారణంగా గురువారం బ్రేక్ డౌన్ అయ్యింది. బ్రేక్ డౌన్ తెలుసుకున్న మహబూబాబాద్ సర్కిల్, సూపెరింటెండింగ్ ఇంజనీర్ నరేష్, మహబూబాబాద్ డివిజినల్ ఇంజనీర్ విజయ్, ఎడిఇ కవిత పర్యవేక్షణలో కొత్తగూడ సెక్షన్ ఎఇ సురేష్ వారి సిబ్బంది క్రింద విధులు నిర్వర్తిసున్న శ్రీకాంత్ అనే ఆన్ మ్యానేడ్ కార్మికుడుకి శుక్రవారం చెప్పిన వెంటనే పొగుళ్లపల్లి గ్రామం సమీపంలోని పాకాల వాగులో గుండె నిబ్బరం, ఆత్మస్థైర్యంతో ప్రవేశించి, అత్యంత దైర్యంతో ఈత కొడుతూ 11 కెవి స్తంభానికి చేరుకున్నారు.

Alaso Read: నడ్డా టీంలో బండి సంజయ్‌కు చోటు..

అత్యంత కష్టం మీద ఎక్కి జంపర్‌లను తెరవడం ద్వారా 4 మునిగి ఉన్న ట్రాన్స్ ఫార్మర్లకు పవర్ లేకుండా చేయడం ద్వారా పోగుళ్లపల్లి, గోవిందపూర్, బోరింగ్ తాండా,మొండ్రాయిగూడెం, మోకాళ్లపల్లి, చక్రాల తాండ గ్రామాలకు విద్యుత్ సరఫరా అందిచగలిగారు. శ్రీకాంత్ కష్టాన్ని అందరు గుర్తించి ప్రశంసలు కురిపించారు. దాదాపు ఈ ఆరు గ్రామాల్లో దాదాపు 954 మంది నివసిస్తున్నారు. శ్రీకాంత్ ధైర్య సాహసాలకు ఉన్నతాధికారులు అందరు మెచ్చుకున్నారు. గ్రామా ప్రజల చేత ప్రశంసలు అందుకున్నారు. శ్రీకాంత్ 6 గ్రామాల ప్రజలకు విద్యుత్ అందించగలిగామని మహబూబాబాద్ ఎడిఇ కవిత, డివిజనల్ ఇంజనీర్ విజయ్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ నరేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News