- Advertisement -
న్యూఢిల్లీ: చైనా నూతన రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త ప్రదీప్కుమార్ రావత్ను నియమిస్తున్నట్టు భారత విదేశాంగశాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ఆయన విధుల్లో చేరుతారని తెలిపింది. 1990 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారియైన ప్రదీప్కుమార్ ప్రస్తుతం నెదర్ల్యాండ్లో రాయబారిగా పని చేస్తున్నారు. గతంలో హాంకాంగ్లో, బీజింగ్లో దౌత్యవేత్తగా పని చేసిన అనుభవం ఆయనకున్నది. చైనా ప్రజలు అధికంగా మాట్లాడే మాండరిన్లోనూ ఆయన నిపుణులు. 2017 సెప్టెంబర్ నుంచి 2020 డిసెంబర్ వరకు ఇండోనేసియా, తూర్పుతైమూర్ రాయబారిగా ఆయన పని చేశారు.
- Advertisement -