- Advertisement -
న్యూఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగనున్నారు. ప్రశాంత్నుకు ఈ బాధ్యతలు అప్పగించే విషయం దాదాపుగా నిర్థారణ అయిందని రెండు రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్జిత్ ఛన్నీ తెలిపారు. అయితే దీనిపై శుక్రవారం పిసిసి నేత నవ్జోత్ సింగ్ సిద్ధూ మరో విధంగా స్పందించారు. ఇటువంటి వాటిపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, ఆయన సేవలు తీసుకోవాలని సిఎంకు ఆలోచన ఉన్నా, తుది నిర్ణయం తీసుకునేది ఆయనది కాదు కదా అని తేల్చిచెప్పారు.
- Advertisement -