Tuesday, April 30, 2024

ప్రభుత్వ తీరుతో బిసిలకు అన్యాయం : ఆర్.కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిసిలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపి ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ పేరుతో బిసిలకు రూ. లక్ష ఆర్థిక చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఓట్ల కోసమే ఎన్నికల సమయంలో పథకాలు తెస్తున్నారని విమర్శించారు. బిసి బంధు ఇస్తామని మోసం చేశారని ధ్వజమెత్తారు. బిసిల కోసం రూ.10 వేల కోట్లు కేటాయించాలన్నారు. లేదంటే గ్రామాల్లో ఎమ్మెల్యేలను తిరగనివ్వమని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో బిసిలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News