Tuesday, April 30, 2024

డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రాంతాల్లో మూసీ పేదలకు పునరావాసం

- Advertisement -
- Advertisement -

డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రాంతాల్లో మూసీ పేదలకు పునరావాసం
సూమారు 10 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇందుకు ఉపయోగించుకొనున్న ప్రభుత్వం
మూసీ అక్రమణల తొలగింపు
పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయింపు కోసం ప్రభుత్వానికి నగర ఎంఎల్‌ఎల ఎకగ్రీవ వినతి
మూసీ అడ్డంకులు తొలగిన తర్వతా మూసీ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందుకు మార్గం సుగమం
ఇప్పటకే మూసీ ప్రాజెక్టు అభివృద్ది కోసం ప్రాథమిక ప్లానింగ్ పూర్తి చేసిన ప్రభుత్వం
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: ఇప్పటికే గుర్తించిన మూసీ నదిలో నివాసం ఉంటున్న పేద ప్రజలను, అక్కడి ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి తప్పించి సురక్షిత ప్రాంతాలకు తరలించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎంఎల్‌ఎల సమావేశం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. మంత్రి కెటిఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాల పైన విస్తృతంగా చర్చించారు.

అత్యంత పేదరికం వలన మూసీ నది పక్కన దుర్భరమైన స్థితిలో జీవనం సాగిస్తున్న వీరందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల రూపంలో గొప్ప ఉపశమనం కలుగుతుందన్నారు. దీంతో పాటు మూసీ నది వరద నివారణ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలకు, భవిష్యత్తు ప్రణాళికలకు ఈ అక్రమణల బెడద కూడా తగ్గుతుందన్నారు. మూసీ వెంట వరదకు అడ్డంకిగా ఉన్న నిర్మాణాలను తొలగించి, మూసిని బలోపేతం చేస్తామని తెలిపారు. మూసీ అడ్డంకులు తొలగిన తర్వతా మూసీ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఇప్పటకే మూసీ ప్రాజెక్టు అభివృద్ది కోసం ప్రాథమిక ప్లానింగ్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. మూసీ వరద నుంచి పేద ప్రజలను, నగరాన్ని కాపాడే ఉదాత్తమైన ప్రభుత్వ కార్యక్రమానికి ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఎల్‌ఎలే స్వయంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటామని తెలపడం పట్ల మంత్రి కెటిఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కబ్జాలను అడ్డంకులను తొలగిస్తే భవిష్యత్తులో మూసి పరివాహక ప్రాంతాలకు వరద ప్రమాదం తగ్గుతుందన్న ఆశాభావాన్ని మంత్రి కెటిఆర్ వ్యక్తం చేశారు. ఎస్‌ఎన్‌డిపి రెండవ దశ కార్యక్రమానికి సంబందించిన పనులను త్వరలోనే మంజూరీ చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో వాననీటి నిర్వహణ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతదన్నారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా వచ్చే వారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలిపిన కెటిఆర్, ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో గుర్తించిన లబ్ధిదారులకి ఇల్లు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉన్నచోటనే నిర్వహిస్తామని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ఎంఎల్‌ఎలకు తెలిపారు హైదరాబాద్ నగరంలో గత పది సంవత్సరాలలో జరిగిన విస్తృతమైన అభివృద్ధి పట్ల ప్రజలు అత్యంత సంతృప్తిగా ఉన్నారన్న నివేదికలు తమకు ఉన్నాయని మంత్రి కెటిఆర్ ఈ సమావేశంలో తెలిపారు.

తమ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లి, రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతు అడగాలని సంద ర్భంగా మంత్రి కెటిఆర్ ఎంఎల్‌ఎలకు దిశానిర్దేశన చేశారు. ప్రభుత్వం హైదరాబాద్ నగరం కోసం ప్రత్యేకంగా చేస్తున్న అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపైన ఈ సమావేశంలో ఎంఎల్‌ఎలంతా ప్రభుత్వానికి, సిఎం కేసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో వరద నివారణ కోసం చేపట్టిన ఎస్‌ఎన్‌డిపి కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని, గతంలో కురిసిన భారీ వర్షాలకు వరద చేరి మునిగి పోయిన అనేక ప్రాంతాలు, ఈ సంవత్సరం భారీగా వర్షాలు కురిసినా వరద ప్రమాదం నుంచి తప్పించుకున్నాయని వెల్లడించారు. ఈ నేప థ్యంలో ఎస్‌ఎన్‌డిపి కార్యక్రమం తో పాటు మూసీ నదిని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలకు ప్రభుత్వానికి అండగా ఉంటామని ఎంఎల్‌ఎలు ఈ సందర్భంగా తెలిపారు.

ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో 10 వేలకు పైగా ఇండ్లను మూసీ నది ఒడ్డున దుర్భర పరిస్ధితుల్లో నివసిస్తున్న పేద ప్రజలకు అందించి, మూసిపైన కబ్జాలను తొలగించేలా ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ను ఎంఎల్‌ఎలంతా ఏకగ్రీవంగా కోరారు. ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో వరద నివారణ కోసం చేస్తున్న కార్యక్రమాలకు మద్దతుగా స్వయంగా ఎంఎల్‌ఎల నుంచి వచ్చిన ఈ ప్రతిపా దనపైన ఎంఎల్‌ఎలను అభినందించిన మంత్రి కెటిఆర్, ఈ మేరకు ప్రభుత్వం మూసి నదిని అడ్డుగా ఉన్న అక్రమణల నుంచి విముక్తం చేసేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వాడుకుంటుందని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News