హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యత ఆయనదేనని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, సినీనటి విజయశాంతి అన్నారు. పార్టీకి రాహుల్ గాంధీయే నాయకత్వం వహించాలని, ఆయన మినహా మరెవరూ పార్టీకి నాయకత్వం వహించలేరని విజయశాంతి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ పోస్టు పెట్టారు. శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం చేసిన సేవలు చిరస్మరణీయమని ఆమె తెలిపారు. పార్టీలో ప్రస్తుత పరిణామాలు త్వరలోనే ఒక కొలిక్కి వచ్చి పరిష్కారమవుతాయన్న విజయశాంతి పటిష్ట నాయకత్వంతో పార్టీ ముందడుగు వేస్తుందని చెప్పారు. ఆ బాధ్యత శ్రీ రాహుల్ గాంధీ తీసుకుంటారని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ సిడబ్ల్యూసి సమావేశం పార్టీ భవిష్యత్, అధ్యక్షుడిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన విషయం విదితమే. కాగా, పార్టీ సీనియర్లు రాసిన లేఖపై రాహుల్ గాంధీ ఫుల్ సీరియస్ అయ్యారు.
శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం చేసిన సేవలు చిరస్మరణీయం. అయితే, పార్టీలో ప్రస్తుత పరిణామాలు త్వరలోనే ఒక కొలిక్కి వచ్చి పరిష్కారమవుతాయని… పటిష్ట నాయకత్వంతో పార్టీ ముందడుగు వేస్తుందని, ఆ బాధ్యత శ్రీ రాహుల్ గాంధీ గారు తీసుకుంటారని విశ్వసిస్తున్నాను. pic.twitter.com/yZZAudb3iW
— VIJAYASHANTHI (@vijayashanthi_m) August 24, 2020