Tuesday, May 21, 2024

దేశమంతా ఈ పాపవంటిదైతే… ఎంతబాగుంటుందో

- Advertisement -
- Advertisement -

కన్నూర్ : ఈ కపట కట్టుకథల దుమారంలో, ఇటువంటి కల్లాకపటం తెలియని ఆదరణ, ఆత్మీయతతో కూడిన ప్రశాంతత ఊరట నిస్తుంది. దేశానికి కావల్సింది ఇదే అని రాహుల్ గాంధీ స్పందించారు. కేరళలోని సొంత నియోజకవర్గం వాయనాడ్‌లో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనను తల్లిదండ్రులతో ఉన్న ఓ మూడేళ్ల పాప దూరం నుంచి పలకరించింది. వెంటనే దూసుకుంటూ రాహుల్ ఉన్న ఎస్‌యువి వాహనంలోకి చేరింది. ఆ పాపతో రాహుల్ కొద్ది సేపు మాట్లాడారు. నీ పేరేమిటీ? నాతో పాటువస్తావా? అని ప్రశ్నించారు. వీరిద్దరి ఫోటోలను వెలుపల ఉన్న వారు తమ సెల్‌కెమెరాలలో క్లిక్ మన్పించారు. కాంగ్రెస్ ఎంపి ఆ పాపకు ఓ చాక్లెట్ ఇచ్చి సెల్ఫీ దిగారు. తరువాత పాప వెళ్లిపోయింది. ఈ చిన్నారితో కొద్ది సేపు అయినా మాట్లాడటం తనకు ఆనందం ఇచ్చిందని ఇటువంటి నిర్మలమైన సహానుభూతి దేశానికి ఇప్పుడు అత్యవసరం అని రాహుల్ తమ ట్వీటులో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News