Saturday, May 4, 2024

రైల్వే యార్డ్‌లో మహిళపై రైల్వే ఉద్యోగుల అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

Railway employees rape on women in Yard

 

చెన్నై: ఇద్దరు రైల్వే ఉద్యోగులు పండ్ల అమ్మే మహిళపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చిన సంఘటన తమిళనాడులోని తంబారామ్ యార్డ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పరనూర్‌లో పండ్ల అమ్ముకునే ఓ మహిళ తంబారామ్ యార్డులోని ఓ బోగీలో నిద్రిస్తుండగా రైల్వే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇద్దరు అక్కడికి వచ్చారు. సదరు మహిళపై అత్యాచారం చేస్తుండగా ఆమె గట్టిగా కేకలు వేయడంతో నిందితులు ఆమెను దుర్భాషలాడి అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు అక్కడి చేరుకొని నిందితులపై ఐపిసి 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆమెను ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News