Sunday, April 28, 2024

కోహ్లీ కోసమైనా కప్ గెలవాలి

- Advertisement -
- Advertisement -

Raina's message to Team India players

టీమిండియా ఆటగాళ్లకు రైనా సందేశం

దుబాయి: ఐపిఎల్ హడావుడి ముగిసిన రెండు రోజులకే మరో క్రికెట్ పండగ మొదలైంది. ఆదివారం ప్రారంభమైన టి20 ప్రపంచకప్‌ను కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసమైనా గెలివాలని టీమిండియా ఆటగాళ్లకు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సూచించాడు. ఈ మెగా టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ టి20 కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకోనుండడంతో సురేశ్ రైనా ఈ మేరకు స్పందించాడు. కోహ్లీ కోసమైనా టీమిండియా ఆటగాళ్లు కసిగా ఆడాలని, భారత్‌కు పొట్టి ప్రపంచకప్‌ను అందించి విరాట్ కోహ్లీకి సగర్వంగా వీడ్కోలు చెప్పాలని రైనా సూచించాడు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ట్వీట్ చేశాడు. కాగా ఈ టోర్నమెంట్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌లో 24న దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో హోరాహోరీ పోరు ఉంటుందని రైనా అంచనా వేశాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News