Thursday, May 2, 2024

బడుగు, బలహీన వర్గాల ఆత్మబంధువు ముఖ్యమంత్రి కెసిఆర్

- Advertisement -
- Advertisement -

ఒయు జెఎసి వ్యవస్థాపక అధ్యక్షుడు డి.రాజారాం యాదవ్

Rajaram Yadav praise cm kcr

 

మనతెలంగాణ/హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం దేశరాజిపల్లి గ్రామంలోని యాదవ సంఘం సభ్యులు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఓయూ జేఎసి వ్యవస్థాపక అధ్యక్షుడు డి.రాజారాం యాదవ్ నాయకత్వంలో త్వరలో జరగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ పేదవర్గాలైన బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తూ ఉద్యమకారులకు, విద్యార్థి నాయకులకు, సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక నాయకుడు కెసిఆర్ మాత్రమేనన్నారు.

సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ, వ్యవసాయానికి సాగునీరు, ఉచిత కరెంట్, కల్యాణలక్ష్మి, వృద్ధాప్య పింఛను, దళితబంధు, కెసిఆర్ కిట్టు, రైతు బంధు, రైతుబీమా, త్రాగునీరు అభివృద్ధి, సంబండ వర్గాలకు అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రజలకు లబ్ధిచేకూరుతుందన్నారు. యాదవ సంఘ సభ్యులు మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన అనేక సంక్షేమ పథకా లకు అకర్షితులై మద్ధతు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్నెబోయిన శ్రీనివాస్ యాదవ్, రాజయ్య యాదవ్, రాజుకుమార్ యాదవ్, భిక్షపతి యాదవ్, ఎల్లబోయిన రాజయ్య యాదవ్, కోటియాదవ్, రోషన్ యాదవ్, సరిత యాదవ్, యశోద యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News