- Advertisement -
భోపాల్: అత్యాచార బాధితురాలు (18) ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది. గత నెలలో బాధితురాలిపై అత్యాచారం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బాలిక ఆత్మహత్య చేసుకుంది. 2.30 గంటల ప్రాంతంలో ఇంట్లోకి వచ్చి చూడగా వేలాడుతూ కనిపించడంతో సోదరుడు కేకలు వేశాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -