Sunday, April 28, 2024

పేటీఎంపై ఆర్‌బిఐ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

ఈ నెల 29 తర్వాత డిపాజిట్ల నిలిపివేత

న్యూఢిల్లీ : ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎంపై ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) ఆంక్షలు విధించింది. కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను నిషేధించింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వచ్చింది. బ్యాంక్ అనేక నిబంధనలను ఉల్లంఘిస్తోందని, ఆడిట్ నివేదికలో ఈ విషయం వెల్లడైందని సెంట్రల్ బ్యాంక్ బుధవారం తెలిపింది. ఈ నిషేధం తర్వాత వినియోగదారులు తమ ఖాతాలో డబ్బును డిపాజిట్ చేయలేరు. అలాగే వాలెట్, ఫాస్టాగ్, ఎన్‌సిఎంసి కార్డ్‌లు కూడా టాప్ అప్ చేయలేరని ఆర్‌బిఐ తెలిపింది.

అయితే డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు కస్టమర్‌కు అనుమతి ఇచ్చారు. ఆర్‌బిఐ ప్రకారం, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఏ కస్టమర్ నుండి డబ్బు డిపాజిట్ చేయకూడదు. ఫిబ్రవరి 29 తర్వాత ఏ కస్టమర్ ఖాతాలోనూ ఎలాంటి డిపాజిట్ అంగీకరించకూడదు. ఈ డబ్బును వాలెట్, ఫాస్టాగ్ లేదా మరేదైనా ప్రీపెయిడ్ సిస్టమ్ ద్వారా తీసుకున్నప్పటికీ అనుమతిలేదు. బాహ్య ఆడిటర్ల నివేదిక ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అనేక ఆర్థిక నిబంధనలను పాటించడంలో పేటీఎం బ్యాంక్ విఫలమైందని ఈ నివేదికలు వెల్లడించాయి.

వీటితోపాటు పలు రకాల అక్రమాలు వెలుగుచూడడంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆర్‌బిఐ ఆదేశించింది. అలాగే, కస్టమర్ తన ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు పూర్తి స్వేచ్ఛను అందించారు. కస్టమర్‌లు తమ పొదుపు, కరెంట్, ప్రీపెయిడ్, ఫాస్ట్‌ట్యాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్‌సిఎంసి) నుండి ఎలాంటి సమస్య లేకుండా డబ్బును తీసుకునేందుకు అవకాశం కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News