Saturday, May 4, 2024

మ్యాక్స్ వెల్ హాఫ్ సెంచరీ… ఆర్ సిబి 101/3

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్ లో భాగంగా చిదంబరం స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 101 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదు పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో త్రిపాతి కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రజత్ పటిదార్ ఒక పరుగు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. దేవ్ దూత్ పడిక్కల్ 25 పరుగులు చేసి ప్రసిద్ధ్ బౌలింగ్ లో త్రిపాతికి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. మ్యాక్స్ వెల్ 37 బంతుల్లో 61 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం క్రీజులో డివిలియర్స్(5), మ్యాక్స్ వెల్ (61) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News