Sunday, April 28, 2024

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఖైదీలకు శిక్ష తగ్గింపు

- Advertisement -
- Advertisement -

Reduction of sentence for prisoners:Azadika Amrit Mahotsav

కేంద్ర ప్రభుత్వం యోచన
ఆగస్టు 15నుంచి మూడు విడతల్లో ఖైదీల విడుదల
50 ఏళ్లు పైబడి సగం శిక్ష పూర్తయిన మహిళలు, దివ్యాంగుల విడుదల
60 ఏళ్లు పైబడిన పురుష ఖైదీలకూ అవకాశం
మరణ శిక్షలు, యావజ్జీవ శిక్షలు లాంటి తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి మాత్రం అవకాశం లేదు
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ లేఖలు

న్యూఢిల్లీ: జైళ్ల్లలో శిక్ష అనుభవిస్తున్న 50 ఏళ్ల పైబడిన మహిళా ఖైదీలు, ట్రాన్స్‌జెండర్లకు ఓ శుభవార్త. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల సందర్భంగా జైల్లో వారి ప్రవర్తనను బట్టి వారి శిక్షల్లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చి విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. 60 ఏళ్లు పైబడిన పురుష ఖైదీలు, దివ్యాంగులు కూడా ఈ మినహాయింపు కిందికి వస్తారు. అయితే వారు తమకు విధించిన మొత్తం శిక్షలో సగం పూర్తి చేసి ఉండాలి. అలాగే తమకు విధించిన జరిమానాలు చెల్లించలేక శిక్షాకాలం పూర్తయినా జైల్లోనే మగ్గుతున్న నిరుపేద, అనాథ ఖైదీల జరిమానాలు మాఫీ చేయడంద్వారా వారికి కూడా ఈ పథకం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. అయితే మరణ శిక్షలు, యావజ్జీవ శిక్షలు, అత్యాచారం, ఉగ్రవాద అభియోగాలపై శిక్ష అనుభవిస్తున్న వారు, వరకట్న మరణాలు, మనీ లాండరింగ్ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారికి ఈ పథకం వర్తించదని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. 2020 నాటి అధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా జైళ్లలో పరిమితికి మించి ఖైదీలున్నారు. మొత్తం జైళ్లలో 4.03 లక్షలమంది ఖైదీలను ఉంచడానికి సదుపాయాలు ఉండగా 4.78 లక్షలకు పైగా ఖైదీలున్నారు. వీరిలో దాదాపు లక్ష మంది మహిళా ఖైదీలున్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోంమంత్రిత్వ శాఖ పంపిప సందేశం ప్రకారం , శిక్ష మినహాయింపునకు అర్హులైన ఖైదీలను మూడు దశల్లో అంటే 2022 ఆగస్టు 15,2023 జనవరి 26, 2023 ఆగస్టు 15న విడుదల చేస్తారు. శిక్షా కాలంలో జైలులో నిరంతరం సత్ప్రవర్తన కలిగిన వారు, ముఖ్యంగా గత మూడేళ్ల కాలంలో ఎలాంటి పనిష్మెంట్ లేని వారు ఈ శిక్ష మినహాయింపు పొందడానికి అర్హులుగా పరిగణిస్తారు. భారత దేశం స్వాతంత్రం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తమ శిక్షా కాలంలో 50 శాతం పూర్తి చేసిన 50 ఏళ్లు అంతకు పైబడిన మహిళా ఖైదీలు, 60 ఏళ్లు అంతకు పైబడిన పురుష ఖైదీలు,70 శాతంకన్నా ఎక్కువ అంగవైకల్యం కలిగిన దివ్యాంగులను విడుదలచేయవచ్చని, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. అలాగే శిక్షాకాలం పూర్తయినప్పటికీ తమపై విధించిన జరిమానాలు చెల్లించలేక జైల్లోనే మగ్గుతున్న నిరుపేదలు, అనాథలను కూడా వారి జరిమానాలును మాఫీ చేయడం ద్వారా విడుదల చేయవచ్చు. సీనియర్ సివిల్, పోటీసు అధికారలుతో కూడిన రాష్ట్రస్థాయి స్క్రీనింగ్ కమిటీ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఖైదీలను విడుదల చేసే అంశంపై నిర్ణయం తీసుకోవాలని కూడా హోం శాఖ ఆ లేఖలో తెలియజేసింది.

అలాగే 18 21ఏళ్ల మధ్య నేరానికి పాల్పడిన, వేరే ఇతర క్రిమిల్ కేసులు లేని వారు, శిక్షా కాలంలో 50 శాతం పూర్తి చేసుకున్న వారికి కూడా ఈ ప్రత్యేక శిక్ష మినహాయింపు పరిశీలించవచ్చని తెలిపింది. అయితే మరణ శిక్షలు పడిన లేదా మరణ శిక్షలను యావజ్జీవ శిక్షలుగా మార్పు చేసిన వారు, మరణ శిక్ష విధించడానికి అర్హమైన నేరానికి పాల్పడిన, యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న వారు,అలాగే రేప్ కేసులో ్లశిక్ష పడిన వారు, ఉగ్రవాద కార్యకలాపాలు, పేలుడు పదార్థాల చట్టం, యాంటీ హైజాకింగ్ చట్టం, అవినీతి నిరోధక చట్ట, వరకట్న మరణం నకిలీ నోట్ల చెలామణి, మనీ లాండరింగ్, నల్లధనం కేసులు లాంటి తీవ్రమైన నేరాలకు పాల్పడి శిక్షలు అనుభవిస్తున్న వారు ఈ మినహాయింపునకు అర్హులు కారని హోంమంత్రి శాఖ ఆ లేఖలో స్పష్టం చేసింది. అలాగే చట్టప్రకారం కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరమైన వారి కేసులను, విదేశీ ఖైదీల విషయంలో సంబంధిత శాఖల అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే విడుదల చేయాలని కూడా స్పష్టం చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News