Wednesday, May 15, 2024

ఎన్నికల కోడ్ నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో అసెంబ్లీ అధికారులు సోమవారం నుంచి ఆంక్షలు విధించారు. అసెంబ్లీ ఆవరణలో ఎలాంటి పార్టీ కార్యక్రమాలు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు మీడియా ప్రతినిధులు సైతం అసెంబ్లీ ఆవరణలో లైవ్‌లను నిర్వహించొద్దని అసెంబ్లీ అధికారులు సూచించారు.

ఎవరైనా ఆదేశాలను అతిక్రమిస్తే అసెంబ్లీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించిన నేపథ్యంలో సోమవారం నుంచి అసెంబ్లీ ఆవరణలో సైతం ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. మీడియా ప్రతినిధులు, పార్టీల నేతలు ఎన్నికల కోడ్ నేపథ్యంలో సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News