Friday, March 29, 2024

కాంగ్రెస్ పాదయాత్ర… మేడారం బయల్దేరిన రేవంత్ రెడ్డి..

- Advertisement -
- Advertisement -

ములుగు: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సోమవారం నుంచి పాదయాత్ర చేపట్టనుంది. మేడారం నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నట్లు ఇప్పటికే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం రేవంత్ రెడ్డి మేడారం బయల్దేరారు. మార్గమధ్యలో ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని గట్టమ్మ, సాయిబాబా ఆలయాలను టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సందర్శించారు.

Revanth Reddy going to medaram to start Padayatra

ఈ సందర్భంగా ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం మేడారం చేరుకుని సమ్మక్క సారలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్రను ప్రారంభించనున్నారు. కాగా, ఇంటి నుంచి మేడారంకి బయలుదేరే ముందు రేవంత్ రెడ్డి కూతురు ఆయనకు హారతి ఇచ్చి, పాదయాత్ర విజయవంతం కావాలని ఆల్‌ ది బెస్ట్ చెప్పింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News