ముంబయి: తనకు, తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంట్ను అతనిస్నేహితురాలు, సినీనటి రియా చక్రవర్తి అంటూ, రక్షణ కల్పించాలని ముంబయి పోలీసులను కోరింది. తమ భవనం కాంపౌండ్ బయట తన తండ్రిని మీడియా వాళ్లు ప్రశ్నలవర్షంతో వేధిస్తున్న ఓ వీడియోను రియా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది కూడా, సుశాంత రాజ్పుత్ మృతి కేసును దర్యాప్తు చేస్తున్న వివిధ ఏజన్సీలకు సహకరించడం కోసం తాము ఇంట్లోనుంచి బైటికి రావడానికి ప్రయత్నిస్తున్నామని ఆమె తెలిపింది‘ ఈ వీడియోలో ఉన్న వ్యక్తి నా తండ్రి ఇంద్రజిత్ చక్రబర్తి(రిటైర్డ్ ఆర్మీ అధికారి). ఇడి, సిబిఐ, వివిధ దర్యాప్తు ఏజన్సీలకు సహకరించడం కోసం మేము ఇంట్లోనుంచి బైటికి రావడానికి ప్రయత్నిస్తున్నాం.
నాకు, నా కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉంది. మేము స్థానిక పోలీసులకు ఈ విషయం చెప్పడమే కాకుండా అక్కడికి వెళ్లాం కూడా. అయినా ఎలాంటి సాయం కల్పించలేదు. మీ వద్దకు రావడం కోసం సాయం చేయమని దర్యాప్తు ఏజన్సీలను కూడా కోరాం. అయినా ఎలాంటి సాయం అందలేదు, ఈ కుటుంబం ఎటా బతకాలి?’ అని ఆమె ఇన్స్టాగ్రామ్లో ఉంచిన ఓ వీడియోలో పేర్కొంది. కరోనా మహమ్మారి దృష్టా కనీస శాంతి ఆంక్షలు కల్పించాలని ఆమె దానిలో పేర్కొంది. ‘సేఫ్టీ ఫర్ మై ఫ్యామిలీ’ అన్న హ్యాష్ట్యాగ్ను కూడా ఆమె దానికి జోడించింది. కాగా గురువారం ఉదయం రియా సోదరుడు శోవిక్ చక్రబర్తిని ప్రశ్నించడం కోసం సిబిఐ ఇక్కడి డిఆర్డిఓ గెస్ట్హౌస్కు పిలిపించింది. ఈ కేసులో రియా కుటుంబ సభ్యుల్లో ఒకరిని ప్రశ్నించడం కోసం సిబిఐ పిలిపించడం ఇదే మొదటిసారి. మరో వైపు రాజ్పుత్ ఫ్లాట్మేట్ సిదార్థ్ పితానిని వరసగా ఏడో రోజు కూడా ప్రశ్నించడం కోసం సిబిఐ పిలిపించింది.
Rhea Chakraborty claims threat to life